Skip to main content

భారత రాజ్యాంగం అంటే

ఓటు వజ్రాయుధం
ఒకే ఒక త్రిశూలం
ఓటు ఒక గాండీవం*
భారత రాజ్యాంగం అంటే 12 షెడ్యూళ్ళు 395 ఆర్టికల్స్ తో ఉన్న ఒక రూల్ బుక్ కాదు
రాజ్యాంగం అంటే ఒక నిత్య మార్గదర్శనం అందులోని ప్రతి అధ్యాయం భారతీయులకు భవిష్య నిర్దేశం చేసే ఒక భగవద్గీత
భారత రాజ్యాంగం లోని ప్రతి అక్షరం ప్రతి పేజీ పుడమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి వేదవాక్కు అందులో ఉన్న ప్రతి వాక్యం ఆసేతు హిమాచలాన్ని ఒక్క తాటిపై నడిపించే శిలాశాసనం రాజ్యాంగంలోని ప్రతి అక్షరం పౌర హక్కులను కాపాడే అస్త్రం భారత దేశ ప్రగతికి బాటలు వేసే ఒక సత్యం ఉద్దేశం
ఇలా గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన నాటి నుంచి ఏడు దశాబ్దాలకు పైగా భారతదేశం అలుపెరగకుండా ముందుకు సాగుతూనే ఉంది
మొదటి ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ముందుకెళ్ళిన
ఆపై ఇందిరాగాంధీ గరీబీ హటావో అని నినదించిన
పీవీ హయాంలో సంస్కరణలకు తెరలేపిన
మన్మోహన్ సింగ్ ఆహారభద్రత ఉపాధిహామీ కల్పించిన
నేటి పాలకులు మేకిన్ ఇండియా అంటూ ప్రపంచ యాత్రలు చేస్తున్న
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది
దేశంలో సంపద పెరుగుతుంటే దాన్ని మించి లాగా పేదరికం కూడా పెరుగుతుంది ఇప్పటికీ దేశంలో 30 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు
దేశంలో 50 కోట్ల మందికి మరుగుదొడ్డి సదుపాయం లేదు దేశవ్యాప్తంగా ఆకలి కేకలు ప్రతిధ్వనించేలా వినిపిస్తూనే ఉన్నాయి అన్నార్తుల ఆర్తనాదాలు పెరుగుతున్న పేదరికం దిగజారుతున్న ఆర్థిక భారతం అవినీతి విశ్వరూపం పిచ్చి పెరుగుతున్న ఉగ్రవాదం దిగజారుతున్న శాంతిభద్రతలు పెరుగుతున్న అంతరాలు అట్టడుగున అన్నదాతలు అందలాలు సంపన్నులు ఆకాశాన నిత్యవసరాలు అమ్మాయిలపై అఘాయిత్యాలు ఇలా ఎటు చూసినా ఇటువంటి నీచ నికృష్ట మైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రజాస్వామ్యం వికసించడం ఎలా???     ' మనకోసం మన రేపటి తరం కోసం

 విజ్ఞులైన ఓటరు లారా మేధావులారా ఆలోచించండి

 ప్రజల కోసం ప్రగతి కోసం మీకోసం నా చివరి రక్తపు బొట్టు ప్రాణాలు ధార పోస్తాం వాళ్ళు అయితే రాష్ట్రాన్ని దేశాన్ని అమ్మేస్తారు మేమైతే స్వర్ణాంధ్ర ఆదర్శ్ ఆంధ్ర బంగారు భారత్ నిర్మిస్తాం

 ఉచితంగా విద్యను ఉచితంగా సైకిళ్ళు చీరలు టీవీలు రుణమాఫీ

 ఇలా ఎంత  కాలం ఇలా మోసం దగా చేస్తారు ఎవడబ్బ సొమ్ము ఉచితంగా ఇవ్వడానికి

 ఇవన్నీ ఎలా చేస్తారు ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో చూపారా

 ఏ పార్టీ అయినా నేల గ్రస్తులకు సీటు ఇవ్వకుండా దూరంగా ఉంచిం దా?

 బడాబాబుల నాయకుల కొన్ని వేల లక్షల కోట్ల పన్ను రుణాల ఎగవేతలు కుంభకోణాలు ఎలా నివారిస్తారు ఏ పార్టీ అయినా  చెప్పిందా

 రాజకీయ నిరుద్యోగులు సమతల కోసం మంత్రి పదవులు కార్పొరేషన్ పదవులు సి పదవులు సృష్టించి సిగ్గులేకుండా వేల కోట్ల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం గురించి ఏ పార్టీ అయినా ఎప్పుడైనా ఆలోచించింది ఇవన్నీ ఇలాగే దశాబ్దాలుగా సాగిపోతున్నాయి

 ఇలాగే సాగిపోవా లా  పరిష్కారం  లేదా  ఉంది మన చేతుల్లోనే మనం మనం జనం జనం ప్రభంజనం అన్నట్లుగా ఓటును వజ్రాయుధంగా ఉపయోగిస్తే దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల ప్రజలు ప్రజాస్వామ్యం  వికసించిన నాడు అన్ని సాధ్యమే

 కదలండి మార్పుకు నాంది పలకండి ఓటు వేయండి భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తును కానుకగా అందించండి మన ఈనాటి   ఓటు  రేపటి ఉజ్వల భవిష్యత్తుకు నాంది

Comments

Popular posts from this blog

64 కళలు ( విద్యలు ) అంటే ?

64 కళలు ( విద్యలు ) అంటే ? మన భారతీయ సంస్కృతిలో 64 కళలు ను తెలియజేసే శ్లోకం వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే. అర్థము: 1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు) 2. వేదాంగములు ….శిక్షలు, వ్యాకరణము , ఛందస్సు , జ్యోతిషము , నిరుక్తము , కల్పములు అని వేదాంగములు ఆరు శాస్త్రములు 3. ఇతిహాసములు …. రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు 4. ఆగమశాస్త్రములు …. శైవాగమము ,పాంచరాత్రాగమము , వైఖానసాగమము ,స్మార్తాగమము అని ఆగమములు నాలుగు . 5. న్యాయము …..తర్కశాస్త్రమునకు పేరు 6. కావ్యాల...

గణతంత్ర దినోత్సవం

మిత్రులకు ముందుగా “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు... నిన్న “N - న్యూస్” అనే చానల్ సర్వే చేసిన వీడియో ఒకటి చూసాను.. ఆ సర్వే ఏంటంటే అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? ఈ విషయాన్ని ఎంతమంది విద్యార్ధులు చెప్తారు ?? నిజానికి ఆ వీడియో చూసాక ఎవరైనా ఓ డబల్ బ్యారల్ గన్ తీసుకుపోయి ఆ సమాధానాలు చెప్పేవాళ్ళను కాల్చిపారేయ్యాలనిపిస్తుంది .. ఒకడేమో జనవరి 26 ప్రేమికుల రోజు అంటున్నాడు.. ఇంకొకరేమో జనవరి 26 గాంధీ జయంతి అంటున్నారు.. మరొకరేమో జనవరి 26 హాలిడే కాబట్టి ఎంజాయ్ చేసే రోజు అంట.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చాలా దారుణంగా సమాధానాలు ఇస్తుంటే .. నిజంగా వీళ్ళు మన భారతీయులేనే ?? అనిపిస్తుంది ... ఇదేనా మనం గొప్పగా చూస్తున్న సువిశాల భారతదేశం ... అంతెందుకు ఇది చదువుతున్న మీరే మీ మనసాక్షిని అడగండి.. ఎంతమందికి “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? అన్న విషయం తెలుసు.. ఒక సినిమాకు ఇచ్చే విలువ కూడా మనం మన దేశానికి ఇవ్వలేకపోవడం శోచనీయం.. స్కూల్స్ లో “గణతంత్ర దినోత్సవం”నాడు జెండా పట్టుకొని, చాక్లెట్స్ తీసుకొని, కాసేపు గీతాలు పాడుకొని, ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ వుంటే అవి చూసి ఇంటికి రావడమే మనం తెలుసుకున్నాం.. ఆ స్కూల్స్...

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం

ఆచార్య శ్రీ బేతావోలు రామబ్రహ్మం గారికి రాష్టప్రతి పురస్కారం వచ్చిన సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు. బేతవోలు రామబ్రహ్మం గారు ప్రముఖ తెలుగు పండితులు, అవధాని, రచయిత మరియు విమర్శకులు. బాల్యం / విద్యాభ్యాసం:- బేతావోలు రామబ్రహ్మం గారి ఒక అతి సామాన్య కుటుంబంలో తల్లిదండ్రులు శ్రీ బేతావోలు సత్యనారాయణ మూర్తి రాధ రుక్మిణీ వీరి తండ్రి గారు వృత్తి రీత్యా పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల గ్రామంలో ఆర్&బి గుమస్తాగా పని చేయడం వల్ల వీరు నల్లజర్ల గ్రామంలో 1948, జూన్ 10 న జన్మించారు. కష్టాలే తోడుగా ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు చదివారు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పి.హెచ్.డి చేశారు. ఉద్యోగం:- మొట్టమొదట ఇతడు గుంటూరులోని కెవికె సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. ఈయన బోధన విద్యార్థులకే కాక సహ అధ్యాపకులైన మల్లంపల్లి వీరేశ్వరశర్మ , కోగంటి సీతారామచార్యులు, జమ్మలమడక మాధవరామశర్మ వంటి పండితులను కూడా ఆకర్షించేది...